ముఖ్యమైన బాలల హక్కులు
1-> జీవించే హక్కు
2-> విద్యా హక్కు
ఈ రెండు ఏదో ఒక కారణాల చేత హరించబడుతున్నాయి. పేదరికం, ఆడపిల్ల, ఇంకా ఇతర అనేక కారణాల చేత జేవించే హక్కు ను కాలరాస్తున్నాము. ఇక విద్యాహక్కు ను ఈ క్రింది విధంగా హరించివేస్తున్నాము.
డి.ఎస్.సి పై హైకోర్ట్ దే తుదినిర్ణయం అని సుప్రీంకోర్ట్ తప్పించుకుంది. ఇక హైకోర్ట్ ప్రభుత్వానిదే తుదినిర్ణయం అని చేతులు దులుపుకుంది. ఇక ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా నియమాకాలు చేపట్టింది. ఈ నియమాకాల ద్వారా ఏమి సాధిస్తున్నాము, ఏమి కోల్పోతున్నాము అని మాత్రము గమనించడము లేదు.
కోర్ట్ అడగని విషయాలు
1-> 50000 పోస్టులు అని మెగా డి.ఎస్.సి అని లిఖిత పూర్వక ఆధారాలను మాత్రమే పరిశీలించింది. మరి వాస్తవ ఆధారములు సమర్పించాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించలేకపోయింది.
2-> 70:30 పోస్టులు అనే GO ప్రభుత్వం జారీ చేసినప్పుడు. పోస్టుల సంఖ్య మరియు దరఖాస్తుల సంఖ్య అందులో బి.ఎడ్ మరియు టి.టి.సి దరఖాస్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అని పరీశీలించలేకపోయింది మరియు ప్రశ్నించలేకపోయింది.
3-> ఏ ప్రాతిపధికన ఈ పోస్టుల విభజన జరిగిందో తెలుసుకోలేకపోయింది.
4-> ప్రత్యామ్నాయ మార్గాలను సూచించమని ఆదేశించలేకపోయింది.
పై విషయాల పరిగణన లేకపోవడం వల్ల 30 శాతం పోస్టులలో పోటి లేకుండా పోయింది. తద్వార నాణ్యమైన ఉపాద్యాయులను వెలికెతీయడంలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పవచ్ఛు. ఇక కోర్ట్ విషయం కు వస్తే నాణ్యమైన ఉపాద్యాయులను అందించలేని నోటిఫికేషన్ విడుదలను, నియమాకాలను మరియు GO లను ఆపడంలో విఫలమై బాలల విద్యా హక్కును కాలరాసి వారికి తీరని అన్యాయాన్ని చేసింది. ఈ రకం కనిపించని అన్యాయాని అడ్డుకోలేని కోర్టులు ఉన్నా! లేకున్నా ఒకటే........
ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి గల వ్యక్తులమైన నాయకులము, అధికారులము, ప్రజలము మనమే ఓనమాలు అంటే ఏమిటో తెలియని పసివారికి ఈ రకంగా అన్యాయం చేస్తున్నాము. ఎవరు అడగగలరు అనే ధీమాచేతనే కదా!
ఇక నుండైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాస్తవికంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి, కోర్టుకు నామనవి. ఇక సులభరీతి లో ఉద్యోగం సంపాదించిన ఉపాద్యాయులు తమ తెలివితేటలను పెంపొందించుకుని విద్యార్థులకు తగు న్యాయం చేయగలరని మనవి.
No comments:
Post a Comment