వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన సరిదిద్దుకోలేని తప్పులలో మెగా డి.ఎస్.సి ఒకటి అని నొక్కి చెప్పవచ్చు. ఎందుకంటే
1-> లేని పోస్టులను సృష్టించాడు.
2-> నోటిఫికేషన్ తరువాత 30% ప్రతిపాదన చేసాడు
3-> ఈ మెగా డి.ఎస్.సి లో పోస్టులు ఎక్కువ కాంపేటేషన్ తక్కువ తద్వార క్వాలిటి తక్కువ అయింది.
రాజు తను చేసింది చట్టం తన మాట వేదం అన్న చందాన ఉచిత ప్రతిపాధనలలో భాగంగా ఉచిత డి.ఎస్.సి వేసాడు. ప్రజలను నట్టేట ముంచి తను స్వర్గం చేరాడు. ఈ డి.ఎస్.సి లో నేడు 4.5(మెదక్) మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. మరియు టి.టి.సి చదివిన ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది.
ఆ అభ్యర్థి చాలా అదృష్టవంతుడు. కాని ఒక్కసారి ఆలోచించండి డి.ఎస్.సి లో 200 ప్రశ్నలు 100 మార్కులు. అంటె 9 ప్రశ్నలకు అతను/ఆమె సరియైన సమాదానం ఇచ్చింది. కనీసం 2 అంకెల స్కోరు చేయలేదు. ఎ, బి, సి, డి లలో కనీసం ఒకే ఒక అక్షరం ను ఉపయోగించిన ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి కావచ్చు. ఇలాటి వ్యక్తి ని తెల్లకాగితం లాంటి పసిపిల్లలకు మార్గదర్షిని చేసిన నా రాష్ట్ర ప్రభుత్వానికి, పరిపాలనకు నా జోహారులు.... ఈ డి.ఎస్.సి నోటిఫికేషన్ ను వేసిన వై.ఎస్.ర్ కు జోహారులు....
ఇక నా సందేహములు
డి.ఎస్.సి నోటిఫికేషన్ ను ప్రిపేర్ చేసినవారు ఎవరు?
వారి విద్యార్హతలు ఏమిటి?
వారి అనుభవం ఎంత?
వారి ఉద్ధేశ్యం (స్వలాభం, ఒక వ్యక్తి లాభం, రాష్ట్ర నాషనం, రాష్ట్ర అభివృద్ధి) ఏమిటి?
పైన లాంటి కనీసం 35 మార్కులు కూడ పొందలేని అభ్యర్థులు ఒక జిల్లాలో కనీసం 100 ఉన్నారు. ఒక్కో అభ్యర్థి కింద 50 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుంటే జిల్లాకు 5000 మంది విద్యార్థుల భవిష్యత్తు గంగలో కలపడానికి ప్రభుత్వం మరియు నోటిఫికేషన్ ను ప్రిపేర్ చేసిన పెద్దలు పక్డ్బందీ గా పన్నిన కుట్ర ఇది. ఇలాంటి నోటిఫికేషన్ లు తయారు చేసి ఇలాంటి కనిపించని కుట్రల తో రాష్ట్రాన్ని అమెరికాకు అప్పు ఇచ్చేలా తీర్చిదిద్దుతారట! అది మనం నమ్మాలి.
బి.ఎడ్ లేదా టి.టి.సి చదవడానికి, ప్రవేష పరీక్ష రాయడానికి కింది తరగతులలో కనీసం 45% ఉత్తీర్ణత ఉండాలి అనే నిర్ణయం విశ్వవిద్యాలయాలు నిర్ణయిస్తే ఉపాద్యాయ వృత్తికి నిర్వహించడానికి మన విద్యాశాఖ ఎలాంటి అర్హతను నిర్ణయించలేదు బలే గొప్ప విద్యాశాఖ. ఈ విషయాన్ని పరిగననలోకి తీసుకోని ప్రభుత్వం ఒక గొప్ప ప్రభుత్వం.
ఇక సరిదిద్దుకోలేని తప్పు అని ఎందుకు అన్నాను అంటే, పైన విలువ కట్టలేని మార్కులతో ఉద్యోగాలు సంపాదించిన అభ్యర్థులు కనీసం 30 సంవత్సరాలు సర్వీస్ లో ఉంటారు. ఈ కాలంలో వారు అనుభవం ద్వారానో, దూరవిద్య ను ఆసరా గా చేసుకొని పై పదవులు పొందుతారు. ఇలాంటి అర్ధంలేని, వ్యర్ద (డ్.ఎస్.సి) ప్రతిపాదనలు మరిన్ని చేస్తారు. ఇది ఒక అశుభ సూచకం అని నా అభిప్రాయం.....
ఒక్క చుక్క విషం లీటరు పాలను విషమయం చేస్తే, మరి ఇలాంటి అభ్యర్థుల వల్ల ఎంతమంది విషమయం కాబోతున్నారో కాలమే నిర్ణయిస్తుంది.
No comments:
Post a Comment