SSC Reslut వచింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఇక మార్కుల విషయంకు వస్తే ప్రతీ సంవత్సరం మార్కుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అది మంచికో లేక చెడుకో అర్థంచేసుకోండి.
1990-1995 లలో 500 మార్కులు గగనం అనేవారు. ఆ విద్యార్థులు తల ఎత్తుకుని తిరిగేవారు. ఆ తరువాత అంటే 1996-2000 వరకు మద్యకాలంలో వీరి సంఖ్య పెరిగింది మరియు చివరి అంకంలో మార్కుల విలువ కూడ పెరిగింది. సుమారుగా 550. ఆతరువాత ప్రతీ సంవత్సరం పెరుగుతూ నేడు 595 మార్కులకు చేరుకుంది.
నాది 2001 . మా పాఠశాలలో నాతో కలిపి మొత్తం 10 మందికి 500 (545-501) ఆపై మార్కులు వచ్చాయి. అందుకు గాను మా నియోజిక వర్గ M.L.A గారు Silver Medal తో సత్కరించారు. ఆనాడు మేము చాలా గర్వపడ్డాము. మరి ఇప్పుడు 550 మార్కులు వచ్చిన విద్యార్థికి ఆ గౌరవం పొందుతున్నాడా లేడా ఆలోచించండి.
ఇక మార్కుల విషయంకు వస్తే...! ఆంగ్లము, హింది, తెలుగు బాషసంబంధ విషయాలు. అందులో ఏమేరకు ప్రావీణ్యం ఉంటే 100 కు 99 or 98 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా నయం ఇప్పుడు 99 or 98 వేస్తున్నారు. ఇకముందు అందులో కూడా 100 మార్కులు చూస్తాము కావొచ్చు. ఇక గణీతం, ఇది తెలిస్తీ దీని అంత సులభమైన సబ్జెక్టు ఇంకోకటి ఉండదు. ఇది ఖశ్చితమైన ఫలిత సంబంధమైనది కావున 100 రావొచ్చు అనుకుందాం! మరి సామాన్య, సాంఘీక శాస్త్రాలు అలాంటివి కావు కదా! మరి వాటిలో కూడ 100 మార్కులు ఎలా వేస్తున్నారు.
నా ఉద్దేశ్యం ప్రకారం దయచేసి ప్రతిభను ఇలా మార్కులను అధికంగా చూపించి చులకన చేయకండి. అలా వారిని ప్రోత్సహిస్తున్నాము అనే భావన ఏమేరకు సరియైనదో విష్లేషించుకోండి.
No comments:
Post a Comment