గౌరవనీయులైన ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి కొనిజేటి.రోషయ్య గారికి వందనములు. సంగారెడ్డి లో 125 వార్షికోత్సవ సభలో మెదక్ జిల్లా పేరును ఇందిరమ్మ జిల్లా గా ప్రకటించారు. అని తెలుసుకున్న నేను మెదట సంతోషించాను తరువాత కొంత బాద పడ్డాను. ఎందుకు బాద పడ్డానో వివరిస్తాను.
ఇక రోషయ్య గారికి ఒక ప్రశ్న. మీ దృష్టిలో ఇందిరాగాంధి గారు, రాజీవ్ గాంధి గారు మరియు సోనియాగాంధి గారు మాత్రమే నాయకులు అని భావిస్తున్నట్లు ఉన్నారు?. తొందరగా నే ఆ స్పృహనుండి బయటికి వస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీ పథకానికి వీరి పేర్లే పెడుతున్నారు. ఉదాహరణకు రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ మిషన్, రాజీవ్ గాంధి లలితకళాతోరణం, ఇందిర గృహకల్ప, ఇందిర క్రాంతి పథకం ఇప్పుడు ఇందిరమ్మ జిల్లా గా మెదక్ జిల్లాకు నామకరణం చేయబోతున్నారు.
ఇందిరమ్మ జిల్లాగా పేరు మార్చడంలో ఉద్ధేశ్యం -> ఇందిరగాంధి తన హయాంలో మెదక్ జిల్లానుండి పోటి చేసి అత్యధిక మెజారిటి తో గెలుపొంది మనదేశ ప్రధాని అయ్యారు తరువాత మెదక్ పరిసరాలను పరిశ్రమలతో కలకలాడేటట్లు చేసింది. మరియు ఆమెను ఆమె ఘనతను, సేవలను చిరకాలం గుర్తుండి పోయెలా చెయ్యాలి.
సరే ఉద్ధేశ్యం మంచిదే కాని పైన పేర్కొన్న నాయకులు మాత్రమే నాయకులు అని అనుకుంటే పొరపాటు. ఇలా ప్రతీ పథకానికి వీరి పేర్లే ఎంచుకునే బదులు మన ఆంధ్రప్రదేశ్ నాయకులు చాలా మందే ఉన్నారని గమనించండి. పింగలి వెంకయ్య గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నీలం సంజీవ రెడ్డి గారు, పి.వి.నర్సింహరావు గారు, మిర్ మహబూబ్ ఆలి గారు, మెదలగు వారు చాలా మంది నాయకులే ఉన్నారు. మరి వీరి పేర్లు ఎందుకు ఎంచుకోవడం లేదు. వీరు నాయకులు కారా లేక వీరికి ఆ అర్హత లేదా! అని నా అనుమానం.
అంతో ఇంతో తెలిసిన నాకే వీరిలో కొందరు పేర్లు ఎప్పుడు వెనలేదు, వినేలాంటి పరిస్థితులు నాకు ఎదురైన సందర్భాలు చాలా తక్కువ. ఇక భవిష్యత్తులో పుట్టబోయె నా పిల్లలకు ఎలా తెలుస్తుందో, ఏమని వెవరించాలో అసలు వాళ్ళు వీరి పేర్లు వెనే అవకాశం వస్తుందో లేదో.
ఇందిరగాంధి గారు తన హయాంలో హైదరాబాదు కు సరిహద్దుగా ఉన్న మెదక్ జిల్లా పరిసరాలను పరిశ్రమలతో కలకలాడేటట్లు చేసింది. కాని ప్రచార అస్త్రం మాత్రము అది కాదు అని నా అభిప్రాయం. మెదక్ జిల్లాను పరిశ్రమల అడ్డా గా మార్చుతా అని చెప్పి రవాణా, పట్టణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదు సరిహద్దు ను అభివృద్ధి చేసింది. రాజకీయ ఎత్తుగడ లతో క్షుణ్ణంగా అద్యయనం చేసి మెదక్ జిల్లాను తను పోటి చేయడానికి అనువైన ప్రదేషం గా ఎంచుకొని తన మాటను ఈ ఫిధంగా నిలుపుకుంది.
పైన పేర్కొన్న నాయకులను కించపరచాలనో తక్కువ చేసి చూపించాలి అనే తాపత్రయం నాకు లేదు. నా అభిప్రాయం ఎమిటంటే మన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి వారినికూడా భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే పరిస్తితులను మనం కల్పించాలి.
ఇంకో విషయం ఏదైనా ప్రకటించే ముందు మాలాంటి సగటు వ్యక్తుల అభిప్రాయం ను పరిగణనలోకి తీసుకోవాలని నా మనవి.
No comments:
Post a Comment