03 August 2011

పుణ్య భూమి నాదేశం

పుణ్య భూమి నాదేశం సినిమా లో హీరో మోహన్ బాబు చివరి డైలాగు " గాంధీజి గుజరాతి కోమటి, నన్నయ బ్రాహ్మణ కులమున పుట్టెను - అని ఎవడు నూరి పోయమన్నాడు "అంటాడు
"ముంబాయి లో 4 చోట్ల పేలుల్లు-కసబ్ పుట్టిన రోజు" అనే వాఖ్యాని కూడా జత చేస్తే ఎలా ఉంటదో!!!!!!!

ఒక సారి ఆలోచించండి. ఒక సామాన్య బాదితుడు లేక పౌరుడి ని "ఈ బాంబు పేలుల్లు కసబ్ పుట్టిన రోజు కావడం లో మీ స్పందన ఏమిటి? అని ప్రశ్నిస్తే అతడు ఏమి సమాదానం ఇవ్వగలడు. పైగా జీవితాంతం గాంధి జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం లా గుర్తు పెట్టుకుంటాడు.

ఇక పోటి పరీక్షలు రాసే అభ్యర్థి ఈ సంఘటనను కరంట్ అఫైర్స్ లో ఇస్తారు కావొచ్చు అని ఒక కోడ్ తయారు చేసుకుంటాడు.
చాచా నెహ్రు పుట్టిన రోజును ఆయనకు పిల్లలంటే ఇష్టం కనుక బాలల దినోత్సవం అన్నారు.
కసబ్ పుట్టిన రోజును ఒక తీవ్రవాది కనుక బాంబు పేలుల్లు జరిగాయి అని గుర్తు పెట్టుకోవడానికి పనికివస్తుంది.

ఒసామా బిన్ లాడెన్ కు కూడ ఇంత ప్రచారం జరగలేదు. అది తొందరగానే మరచిపోయి ఉంటారు.

నా ఉద్దేశ్యం :- నిన్నటి పేలుల్లకు కసబ్ పుట్టినరోజు ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లూ గా తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రమాదకర ప్రచారం లబించకుండా ఉంటే బాగుంటుంది.

నా యీ పోస్ట్ కూడా నెగెటివ్ ప్రచారమే అవుతుంది. కాని, కసబ్ ను మనం ఇంకా చంపకుండా, ఉరితీయకుండా, తగిన శిక్ష విధించకుండా ఇంకా ఎందుకు జైలు గోడల మధ్య ఉంచి పెంచి పోషిస్తున్నాము. ఏవైనా కొత్త ఆధారాలు దొరుకవచ్చు, ఇన్వెస్టిగేషన్ లో పురోగతి లభించవచ్చు ముందుముందు ఇలాంటి తీవ్రవాద చర్యలను నివారించవచ్చు అనే ఒక ఆశ. మరి నివారించగలిగామా? నిన్నటి పేలుల్ల ను ఆపగలిగామా?
పై ప్రశ్నలకు "లేదు" అనేది సమాదానం అయితే, కసబ్ ను రక్షించడానికి మనం కర్చుచేస్తుంది వృధా అయినట్లే లెక్క, మరియు కసబ్ ను ఇంకా శిక్షించకుండా ఉండటం కూడా సరియైన పద్దతి కాదు.

కాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను, సైకాలజి ప్రకారం "బహుమతి-దండన" లలో బహుమతి వల్ల కీడు కంటే మేలు ఎక్కువ జరుగుతుంది అని భావింఛి పాఠశాల లో బెత్తెంతో దండించడాన్ని నిశేధించాము. అలాగే దేశ పురోగతికి నాయకులు బహుమతులు అయితే కసబ్ లాంటి వారు దండన కోవలోకి వస్తారు. అందువల్ల ఇలాంటి వారిని ఏమి చేయాలి - పుట్టినరోజు ప్రచారాలను ఎలా ఆపాలో ఆలోచించాలి.

No comments:

Post a Comment